మన హిందూ ధర్మ శాస్త్రాలలో అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని చెప్పబడింది.
"అన్నం బహు కుర్వీత తద్వతమ్" (తైత్తిరీయ ఉపనిషత్తు)
అనగా, అన్నమును సమృద్ధిగా ఉత్పత్తి చేసి, దానిని పదిమందికి పంచడం ఒక గొప్ప వ్రతం.
అన్నం ప్రాణః" - అన్నమే ప్రాణం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే సాక్షాత్తు పరమాత్మకు నైవేద్యం సమర్పించడమే.
కృష్ణానది ఒడ్డున, మల్లాది గ్రామానికి కిలోమీటర్ దూరంలో, పచ్చని పొలాల మధ్య వటవృక్ష స్వరూపంగా స్వామివారు వెలిశారు. ప్రతి శనివారం జరిగే దివ్య కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తులు పిల్లాపాపలతో విచ్చేస్తారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు కళ్యాణం ముగిసే సమయానికి భక్తులు ఆకలితో అలమటించేవారు. సమీపంలో భోజన వసతి లేక, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతికి వెళ్ళవలసిన ఇబ్బందిని గమనించి, ధర్మకర్తలు ఒక మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు.
ఈ మహత్తర అన్నప్రసాద కార్యక్రమం 2006వ సంవత్సరంలో ప్రారంభమైంది. యేలూరి మంగాయమ్మ గారు మరియు ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్న వారి కుమారుడు యేలూరి శ్రీనివాస్ గారు, భగవంతుని ఆజ్ఞతో ఈ సేవకు శ్రీకారం చుట్టారు.
ఈ అన్నప్రసాద వితరణ అత్యంత పవిత్రంగా, రుచికరంగా భక్తులకు అందాలనే ఉద్దేశంతో... మంగాయమ్మ గారి కుమారుడు శ్రీ యేలూరి నారాయణమూర్తి గారు స్వయంగా ఈ కార్యక్రమ పనులన్నింటినీ దగ్గరుండి చూసుకుంటున్నారు. వంటల తయారీ నుండి వడ్డన వరకు ప్రతి అంశాన్ని వారు పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎటువంటి లోటు కలగకుండా శ్రద్ధ వహిస్తున్నారు.
మల్లాది క్షేత్రంలో భక్తులకు అందించే అన్నప్రసాదం కేవలం భోజనం కాదు, అది స్వామివారి అమృత ప్రసాదం.
ఈ మహత్తర అన్నదాన యజ్ఞంలో భక్తులు తమ శక్తి కొలది భాగస్వాములు అవుతున్నారు.
మీరు కూడా ఈ దివ్య క్రతువులో పాల్గొని, భక్తుల ఆకలిని తీర్చి, తద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము.