కళ్యాణ తత్త్వము - లోక కళ్యాణ కారకముచన ॥
శ్రీమన్నారాయణుడు వైకుంఠమును వీడి, లక్ష్మీదేవి కోసం భూలోకమునకు విచ్చేసిన పరమ పవిత్ర అవతారమే శ్రీ వేంకటేశ్వర అవతారము. సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మిని, సహనానికి మారుపేరైన భూదేవిని తన హృదయ పీఠమున నిలుపుకున్న దివ్యమూర్తి మన తండ్రి శ్రీనివాసుడు.
శ్రీ భూ సమేత వేంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే నిత్య అర్చనలు, అభిషేకములు, భజనలు మరియు వేద పారాయణములలోకెల్లా అత్యంత ఫలప్రదమైనది, సమున్నతమైనది స్వామి వారి కళ్యాణ మహోత్సవ సేవ.
తిరుమల కొండపై వెలసిన స్వామి వారి సన్నిధిలో ఎటువంటి నిత్య కళ్యాణ మహోత్సవములు జరుగుతాయో, అదే రీతిలో మల్లాది క్షేత్రంలోనూ స్వామి వారి కళ్యాణము అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతోంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించినా, అందులో పాల్గొన్న భక్తులకు అనంతమైన పుణ్య ఫలము మరియు స్వామి వారి విశేష అనుగ్రహము లభిస్తుంది.
మల్లాది క్షేత్రంలో వెలసిన స్వామి వారికి విశేషమైన సేవలందించాలనే తలంపుతో, దేవస్థాన ధర్మకర్తలకు 2006వ సంవత్సరంలో ఒక మహోన్నతమైన సంకల్పం కలిగినది. స్వామి వారు ప్రసాదించిన ఆ సంకల్ప బలంతో:
వందలాదిగా జరిగిన ఈ దివ్య కళ్యాణములలో పాల్గొనడం ద్వారా కలిగే పుణ్యఫలం అనన్యసామాన్యమైనది. భక్తులందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని, శ్రీ భూ సమేత వేంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాము.